- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌటింగ్లో కరోనా భయం వెంటాడింది. ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో అధికారులు, ఏజెంట్లు పీపీఈ కిట్లతో దర్శనమిచ్చారు. ఆఫీసర్లు కూడా ఫుల్ ఫేస్ మాస్కులను ధరించి వార్ రూమ్కు వచ్చారు. కరోనా వ్యాప్తి చెందకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ప్రతి లెక్కింపు కేంద్రాల్లో మాస్కులు, పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచారు. కరోనా నిబంధనలపై ఒక రోజు ముందుగానే సిబ్బందికి, ఏజెంట్లకు అవగాహన కల్పించినట్లు స్పష్టం చేశారు.
ముందస్తు జాగ్రత్తతోనే..
హూజూరాబాద్ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రచారాలు, పార్టీలు, బహిరంగ సభలకు పెద్ద ఎత్తున హజరయ్యారు. వీరిలో 85 శాతం మంది మాస్కు, భౌతిక దూరాన్ని మరిచిపోయారు. దీంతో మొదట్నుంచి ఆ సెగ్మెంట్లో కరోనా భయం నెలకొన్నది. వైద్యాధికారులు పలు సార్లు అవగాహన కల్పించారు. అయితే ప్రస్తుతం వాతావరణ మార్పులతో చాలా మందికి దగ్గు, జలుబు వంటి కరోనా లక్షణాలు ఉండటంతో కలెక్టర్ సూచన మేరకు కౌంటింగ్ హాల్లోకి వచ్చే ఏజెంట్లు, అధికారులు, మాస్కు, భౌతిక దూరాన్ని పాటిస్తూ పీపీఈ కిట్లను ధరించారు. కాగా, ఆసుపత్రుల్లో కనిపించే పీపీఈ కిట్లు చాలా రోజుల తర్వాత కౌంటింగ్ కేంద్రాల్లో కనిపించడంతో జనాలు కొద్ది సేపు కంగారు పడ్డారు. కేంద్రాల్లో ఏం జరుగుతుందంటూ అధికారులను ఆరా తీశారు.