ఏపీలో 7,085కు చేరిన కరోనా మరణాలు

by  |
ఏపీలో 7,085కు చేరిన కరోనా మరణాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 57,716మందికి పరీక్షలు నిర్వహించగా 379మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,79,718కు చేరింది. ముగ్గురు చనిపోవడంతో మొత్తం మృతుల సఖ్య 7,085గా ఉంది. ప్రస్తుతం 3,864 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,68,769 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 490మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,14,15,246 మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 19మందికి కరోనా పాజిటివ్‌లు నిర్ధారణ కాగా చిత్తూరులో 64, తూర్పుగోదావరిలో 35, గుంటూరులో 46, కడపలో 33, కృష్ణా జిల్లాలో 84, కర్నూలులో 5, నెల్లూరులో 15, ప్రకాశంలో 13, శ్రీకాకుళంలో 16, విశాఖపట్నంలో 32, విజయనగరంలో 4, పశ్చిమగోదావరిలో 13కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed