ఏపీలో 6,899కి చేరిన కరోనా మరణాలు

by  |
ఏపీలో 6,899కి చేరిన కరోనా మరణాలు
X

దిశ; వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 66,918 మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించగా 1,236 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8లక్షల 57వేల 395కు చేరింది. 9మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 6,899గా ఉంది. ప్రస్తుతం 16,516 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8లక్షల 33వేల 980 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 1,696మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 93,33,703 శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, కృష్ణా జిల్లాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, తూర్పుగోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 49పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 157, తూర్పుగోదావరిలో 155, గుంటూరులో 181, కడపలో 60, కృష్ణాలో 194, కర్నూలులో 26, నెల్లూరులో 38, ప్రకాశంలో 24, శ్రీకాకుళంలో 51, విశాఖపట్నంలో 53, విజయనగరంలో 28, పశ్చిమగోదావరిలో 220 పాజిటివ్ కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed