ఏపీలో 6,500 దాటిన కరోనా మరణాలు

by  |
ఏపీలో 6,500 దాటిన కరోనా మరణాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కొద్దిరోజుల నుంచి తక్కువ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 74,422 మందికి పరీక్షలు నిర్వహించగా 3,746 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,299కు చేరింది. 27మరణాలు సంభవించడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,508గా ఉంది. ప్రస్తుతం 32,376 యాక్టివ్‌ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 7,54,415మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 7,739 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 72.71లక్షల మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి కృష్ణా జిల్లాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా అనంతపురం జిల్లాలో ముగ్గురు, చిత్తూరులో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కడప, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 301మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా చిత్తూరులో 437, తూర్పుగోదావరి జిల్లాలో 677, గుంటూరులో 396, కడపలో 166, కృష్ణా జిల్లాలో 503, కర్నూలులో 65, నెల్లూరులో 116, ప్రకాశంలో 127, శ్రీకాకుళంలో 167, విశాఖపట్నంలో 138, విజయనగరంలో 134, పశ్చిమగోదావరిలో 519 కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.



Next Story

Most Viewed