రాష్ట్రంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా మరణాలు

by  |
AP corona Update
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 88,378 సాంపిల్స్ పరీక్షించగా 3,042 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,08,065కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజులో 28 మంది కొవిడ్‌ రోగులు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 12,898కి చేరింది. ఇదే సమయంలో 3,748 మంది కొవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా..ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 18,61,937కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 33,230 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 2,25,24,187 సాంపిల్స్‌ పరీక్షించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.



Next Story

Most Viewed