- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం బై ఎలక్షన్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలో మాజీమంత్రి ఈటల రాజేందర్ ప్రజాదీవెన పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆ ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు, పలువురు నేతలు రోజు గుంపులుగుంపులుగా సంచరిస్తున్నారు. ఈ క్రమంలోనే హుజురాబాద్లో కరోనా మరణం నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అయితే, నియోజకవర్గంలోని కాట్రపల్లి గ్రామంలో ఓ రైతు కరోనాతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల ఆయన ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడే కరోనా సోకినట్లు తెలుస్తుండగా.. వెంటనే ఆ రైతును హనుమకొండ, కరీంనగర్లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఆదివారం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వారు తెలిపారు. కాగా మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె కలరు.