- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
by B.Srinivas |
<p>దిశ వెబ్డెస్క్: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఇటీవల మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కూడా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో… ప్రభావిత ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 18,711 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,12,10,799కి […]</p>

X
దిశ వెబ్డెస్క్: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఇటీవల మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కూడా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో… ప్రభావిత ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.
అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 18,711 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,12,10,799కి చేరుకుంది. కొత్తగా 14,392 మంది కోలుకోగా.. వీటితో కలిపి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,08,68,520కి చేరుకుంది.
ఇక రికవరీ రేటు 96.95 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 100 మంది కరోనాతో చనిపోగా.. మరణాల సంఖ్య 1,57,756కి చేరుకుంది. మరణాల రేటు 1.41 శాతంగా ఉంది.
Next Story






