ఏపీలో కొత్తగా 1,901 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 1,901 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 51,544 మందికి పరీక్షలు నిర్వహించగా 1,901మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8లక్షల 8వేల 924కి చేరింది. ఇవాళ 19మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,606గా ఉంది. ప్రస్తుతం 28,770 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 7,73,548మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 3,972మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 76లక్షల 21వేల 896మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలింపింది.

కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోగా కడపలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 289, తూర్పుగోదావరి జిల్లాలో 313, గుంటూరులో 295, కడపలో 85, కృష్ణా 74, కర్నూలులో 63, నెల్లూరులో 98, ప్రకాశంలో 104, శ్రీకాకుళంలో 18, విశాఖపట్నంలో 85, విజయనగరంలో 59, పశ్చిమగోదావరిలో 397మంది కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story

Most Viewed