ఉమ్మడి నిజామాబాద్‌లో 222 కేసులు

by  |
ఉమ్మడి నిజామాబాద్‌లో 222 కేసులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం కొత్తగా 222 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో నిజామాబాద్ జిల్లాలో 107, కామారెడ్డి జిల్లాలో 115 కేసులు వెలుగుచూశాయి.

నిజామాబాద్ వ్యాప్తంగా బుధవారం నాటికి 1,444 కరోనా కేసులు నిర్దారణ కాగా, అందులో 56 మంది మరణించారు. హోమ్ ఐసోలేషన్‌లో 925 మంది ఉండగా, ఆస్పత్రి ఐసోలేషన్ లో 214మంది ఉన్నారు. 149మంది పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జి అయ్యారు. కామారెడ్డి జిల్లాలో 115 కొత్తగా పాజిటివ్ తేలగా, మొత్తం కేసుల సంఖ్య 1,335కు చేరింది.



Next Story

Most Viewed