భారత్‌లో కరోనా విలయతాండవం

by  |
భారత్‌లో కరోనా విలయతాండవం
X

దిశ, వెబ్‌ డెస్క్ :
భారత్ లో కరోనా కేసులు విజృంభిస్తూనే ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ, ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడచిన 24గంటల్లో దేశంలో 52,123కేసులు నమోదు కాగా, 775మరణాలు సంభవించాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 15,83,792కు చేరగా, ఇప్పటివరకు 34,963 మరణాలు సంభవించాయి. కరోనాతో పోరాడి ఇప్పటివరకు 10,20,582 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, ప్రస్తుతం దేశంలో 5,28,242 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గత కొద్దిరోజులుగా మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా.. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.



Next Story

Most Viewed