రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

by  |
AP corona Update
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండు రోజులు పాటు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 86,280 సాంపిల్స్‌ని పరీక్షించగా 2,527 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 19,46,749కి చేరింది. అదే సమయంలో కరోనాతో 19 మంది మరణించగా..మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 13,197కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2,412 మంది కరోనా నుంచి కోలుకోగా..మెుత్తం ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 19,09,613కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,939 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. ఇకపోతే ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,38,38,636 సాంపిల్స్‌ని పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.


Next Story