ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 84 కేసులు

by  |
corona
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. శుక్రవారం ఒక్కరోజే 84 కొత్త కేసులు వెలుగు చూశాయి. గురువారం 72 కేసులు కాగా శుక్రవారం మరిన్ని ఎక్కువ కేసులు వెలుగుచూడటం జిల్లా వాసులను కలవరపెడుతోంది. నిజామాబాద్‌లో శుక్రవారం 49, కామారెడ్డి జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి. ఇందూర్ జిల్లాలో 1,362 మందికి పరీక్షలు నిర్వహించగా 1,313 మందికి నెగిటివ్ రాగా, 49 మందికి పాజిటివ్ వచ్చింది.

నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా 16,704 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 1,076 మందికి పరీక్షలు చేయగా 1,041 మందికి నెగిటివ్ రాగా 35 మందికి పాజిటివ్ అని తేలింది. ఇక జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 13,979 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.



Next Story