దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎన్నంటే..

by  |
దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎన్నంటే..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం..గడచిన 24 గంటల్లో 2,61,500 కొత్త కేసులు నమోదవ్వగా, చికిత్స పొందుతూ 1,501 మంది మృతిచెందారు. తాజా కేసులతో కలిపి భారత్లో ఇప్పటివరకు మొత్తంగా 1,47, 88,109 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా మరణాలు 1,77,150కు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 18,01,316 యాక్టివ్ కేసులు ఉండగా, 1.28కోట్ల మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. కాగా, ఇండియాలో ఇప్పటివరకు మొత్తంగా12.26 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ తీసుకున్నారు.

Next Story

Most Viewed