భారత్‌లో 96 లక్షలు దాటిన కరోనా కేసులు

by  |
భారత్‌లో 96 లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‎డెస్క్: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 96 లక్షలు దాటాయి. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో తాజాగా 36,652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 512 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 96,08,211కి చేరింది. ఇప్పటివరకు 1,39,700 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,09,689 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 90,58,822 మంది డిశ్చార్జ్ అయ్యారు.


Next Story