భారత్‎లో 89 లక్షలు దాటిన కరోనా కేసులు

by  |
భారత్‎లో 89 లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా కేసుల సంఖ్య 89 లక్షలు దాటింది. తాజాగా గ‌త 24 గంట‌ల్లో 38,617 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న ఒక్కరోజే 474 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 89,12,908కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,30,993 మంది మృతి చెందారు. ఇక ప్రస్తుతం యాక్టివ్‎గా 4,46,805 కేసులు ఉండ‌గా.. కరోనా నుంచి కోలుకుని 83,35,110 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.



Next Story