ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు

by  |
AP corona Update
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ..తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ వైద్యఆరోగ్యశాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 69,173 సాంపిల్స్‌ను పరీక్షించగా 1,435 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,00,038 కి చేరింది. అదే సమయంలో కరోనాతో ఆరుగురు మృతి చెందారు. తాజా మరణాలతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 13,702కు పెరిగింది.

గడిచిన 24 గంటల్లో 1,695 మంది కరోనా నుంచి కోలుకోగా మెుత్తం ఇప్పటి వరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,70,864కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,472 యాక్టీవ్‌ కేసులున్నాయని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వ‌ర‌కు మొత్తం 2,59,72,539 సాంపిల్స్‌ను ప‌రీక్షించిన‌ట్టు వైద్యఆరోగ్య శాఖ స్పష్టం చేసింది


Next Story