ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

by  |
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 48,518మందికి పరీక్షలు నిర్వహించగా 238మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,82,850కి చేరింది. ముగ్గురు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,111గా ఉంది. ప్రస్తుతం 3,194 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,72,545మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 279మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,19,32,603మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 11మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా చిత్తూరులో 59, తూర్పుగోదావరిలో 15, గుంటూరులో 32, కడపలో 16, కృష్ణా జిల్లాలో 32, కర్నూలులో 11, నెల్లూరు 4, ప్రకాశం 6, శ్రీకాకుళం 4, విశాఖపట్నంలో 21, విజయనగరంలో 5, పశ్చిమగోదావరిలో 22కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, చిత్తూరులో ఒకరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed