పడగ విప్పుతున్న కరోనా

by  |
పడగ విప్పుతున్న కరోనా
X

దిశ, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 765 కరోనా కేసులు.. 12 మరణాలు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి సంబంధించినవి 727 కేసులు కాగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 38 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 17,699కి చేరింది. మొత్తం 24,962 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కోసం చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 9,473గా ఉంది. ఇప్పటివరకు 8,008 మంది కరోనా నుంచి కోలుకోగా.. 218 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Next Story

Most Viewed