ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు

by  |
AP corona Update
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో 68,041 సాంపిల్స్ పరీక్షించగా 1,433 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,97,102కు చేరింది. అదే సమయంలో 15 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు.

దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 13,686కు చేరింది. గత 24 గంటల్లో 1,815 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 19,67,472 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15,944 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,58,35,650 కరోనా టెస్టులు చేసినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది.


Next Story