- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రభుత్వం కరోనా నివారణ దిశగా చర్యలు తీసుకుంటున్నా కూడా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వందల సంఖ్యలో ప్రజలు దాని బారిన పడి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో 78,761 కొత్త కేసులు నమోదయ్యాయి. 948 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 35,42,734 కు చేరుకుంది. 27,13,934 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 7,65,302 మంది బాధితులు ఇంకా కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకి 63,498 మంది మృతిచెందారు.
Next Story