- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కుత్బుల్లాపూర్ : కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ ఆ కుటుంబానికి శాపంగా మారింది. ఉపాధి లేక ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో ఓ వంట మనిషి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రాంబాబు కథనం ప్రకారం… పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప గ్రామానికి చెందిన పి.దుర్గాప్రసాద్ (35) గత 4 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం జీడిమెట్లలకు భార్య, పిల్లలతో కలిసి వలస వచ్చాడు. వంట మనిషిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.
అయితే లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు తలెత్తడంతో మనస్థాపానికి గురైన దుర్గాప్రసాద్ ఆదివారం రాత్రి భార్య, పిల్లలతో కలిసి బెడ్రూంలో పడుకున్నాడు. అందరు నిద్రపోయాక వెలుపలకు వచ్చి బెడ్రూం కు గడియ పెట్టాడు. కాటన్ క్లాత్ తో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం తెల్లవారు జామున భార్య తలుపు తీసినా రాకపోవడంతో కేకలు వేసింది. స్థానికులు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.