మోత్కూర్‌లో వైద్యుడికి కరోనా

by  |
మోత్కూర్‌లో వైద్యుడికి కరోనా
X

దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఓ కంటి వైద్యుడికి కరోనా సోకింది. ఈ మేరకు మెడికల్ ఆఫీసర్ కిషోర్ ధృవీకరించారు. మోత్కూరు మండలంలో దాదాపు 25 మందికి ఆయన కంటి పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ 25 మందిని హోం క్వారంటైన్ చేశారు. మోత్కూర్‌లో పాజిటివ్ కేసు నమోదు కావడంతో వ్యాపారస్థులు స్వచ్ఛంద నిర్ణయం తీసుకున్నారు. పండ్లు, కూరగాయలు, కిరాణా దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేయాలని నిర్ణయించారు.



Next Story

Most Viewed