టీటీడీలో 80మందికి కరోనా

by  |
టీటీడీలో 80మందికి కరోనా
X

దిశ ఏపీ బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా టీటీడీలో మొత్తం 80మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా కలెక్టరు ఎన్‌.భరత్‌ గుప్తా వెల్లడించారు. టీటీడీలో నిత్యం 200 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని కూడా వివరించారు. భక్తుల ద్వారా ఉద్యోగులకు వైరస్‌ సోకినట్లు ఆధారాల్లేవని ఆయన చెప్పారు. ఇప్పటిదాకా 800 మంది భక్తులకు పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్‌ వచ్చిందని స్పష్టంచేశారు.

Next Story