- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా పాండమిక్ తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా వంటనూనెల ధరలు భగ్గుమన్నాయి. లీటర్ వంటనూనె రూ.150 నుంచి 160 వరకు చేరుకోవడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల వంటనూనెలపై కేంద్రం ఎక్సైజ్ సుంఖం తగ్గించడంతో మేజర్ ఎడిబుల్ ఆయిల్ సంస్థలు ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి.
అదానీ విల్మర్, రుచి సోయా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు ఆయిల్ ధరలను లీటరుకు రూ.4 నుంచి 7 వరకు తగ్గిస్తున్నట్టు తెలిపాయి. మిగతా కంపెనీలు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తాయని SEA తెలిపింది. జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా(హైదరాబాద్)తో పాటు ఇతర నగరాలకు చెందిన కొన్ని ముఖ్యమైన ఆయిల్ కంపెనీలు ధరలు తగ్గించినట్టు తెలుస్తోంది. పండుగ ఫూట ఆయిల్ ధరలు తగ్గడం అనేది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరటనిచ్చే అంశం.
Next Story