సాంస్కృతిక శాఖ మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు

by  |
సాంస్కృతిక శాఖ మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులందరూ మదర్సాల్లో పెరిగారని, జమ్మూకాశ్మీర్‌ను ఉగ్రవాద కర్మాగారంగా మార్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో కూడా ఉషా ఠాకూర్ గార్భేకు ముస్లింలను అనుమతించొద్దని, కన్హయ్యకు అతని తల్లి దేశభక్తిని నూరిపోయలేదని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా మధ్యప్రదేశ్‌లో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ సీఎం కమల్‌నాథ్.. మంత్రిని ‘ఐటం’గా అంటూ వ్యాఖ్యలు చేయగా… ప్రతిపక్ష నేత భార్యను ‘ఉంపుడుగత్తె’ అని ఒక మంత్రి అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.


Next Story

Most Viewed