- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హైదరాబాద్: కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు ఎంపిక చేసి.. చివరికి ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగంలో చేరమనడం దారుణమని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మండిపడ్డారు. ఈ మేరకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరును నిరసిస్తూ.. కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు.
టిమ్స్లో కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ నర్సులు కావాలని అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి 246 మందిని ఎంపిక చేశారు. వీరిలో 30 మంది స్టాఫ్ నర్సులను గాంధీ హాస్పిటల్లో విధులకు చేరాలని సూచించడంతో వారు సోమవారం గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. సుమారు నాలుగు గంటల నిరీక్షణ అనంతరం ఆస్పత్రికి చెందిన ఓ మహిళా అధికారి వచ్చి ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని చెప్పంది. దీంతో వారు ఆమెతో వాగ్వాదానికి దిగారు. అనంతం స్టాఫ్ నర్సులు కోఠికి చేరుకుని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయ ముట్టడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్టాఫ్ నర్సులు ప్రకటించారు.