కడప డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట కలకలం  

by  |
కడప డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట కలకలం  
X

దిశ, వెబ్ డెస్క్: కడప డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట కలకలం రేగింది. ఉద్యోగాలు పోతాయనే భయంతో కిరోసిన్ పోసుకుని కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ స్థానాల్లో ఇతరులను నియమించనున్నారని మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది.

కోవిడ్ విధుల తర్వాత పూర్వ స్థానాల్లో నియమిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు కొత్తవారిని నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ పై ప్రశ్నించడంతో ల్యాబ్ టెక్నీషియన్లపై డీఎంహెచ్ఓ మండిపడ్డారు. జీతాలకు సంబంధించి ట్రెజరీ లింకును కట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆందోళన బాటపట్టిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆదివారం డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు.

Next Story

Most Viewed