- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : కాంట్రాక్ట్ పద్ధతిన వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీనికి గౌరవ వేతనాలను సైతం ఖరారు చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్షణం డాక్టర్లను, నర్సులను, లాబ్ టెక్నీషియన్లను, పారామెడికల్ సిబ్బందిని ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన మూడు నెలల పాటు నియమించుకునేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సుమారు 50 వేల మంది నుంచి దరఖాస్తులను తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరికి గౌరవ వేతనాన్ని ఖరారు చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వీరిని నియామకం చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. అయితే ఎంతకాలం పని చేయాలనేది మాత్రం స్పష్టం చేయలేదు. వైద్యారోగ్య శాఖ నుంచే వీరిని నియమించుకోనున్నారు.
వేతనాలు ఇవే
కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునే స్పెషలిస్టు మెడికల్ఆఫీసర్కు రూ. లక్ష చొప్పున గౌరవ వేతనాన్ని చెల్లించనున్నారు. అదే విధంగా ఎంబీబీఎస్ మెడికల్ ఆఫీసర్కు రూ. 40 వేలు, ఆయుష్మెడికల్ ఆఫీసర్కు రూ. 35వేల చొప్పున వేతనం ఇవ్వనున్నారు. స్టాఫ్ నర్స్కు రూ. 23వేలు, ల్యాబ్టెక్నీషియన్స్కు రూ. 17 వేలచొప్పున గౌరవ వేతనాన్ని ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.