కంటైనర్‌లో మంటలు.. ట్యాబ్‌లెట్స్ దగ్ధం

by  |
కంటైనర్‌లో మంటలు.. ట్యాబ్‌లెట్స్ దగ్ధం
X

దిశ, వెబ్ డెస్క్: కంటైనర్ లో మంటలు చెలరేగి ట్యాబ్ లెట్స్ దగ్ధమైన ఘటన శంషాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాన్సీమియాగుడా వద్ద బెంగుళూరు జాతీయ రహధారిపై వెళ్తున్న ఓ కంటైనర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను గమనించిన డ్రైవర్ ఆ కంటైనర్‌ను పక్కకు ఆపాడు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందిని రప్పించి మంటలు అదుపు చేశారు. బెంగుళూరు నుండి మైక్రో ల్యాబ్ కు ట్యాబ్ లెట్స్ తీసుకెళ్తండగా ప్రమాద జరిగింది. ఈ ప్రమాదంలో ట్యాబ్ లెట్స్ దగ్ధమైనట్లు తెలిసింది.

Next Story

Most Viewed