నిర్మాణ రంగ కార్మికులకు రూ.5000 చెల్లించాలి

by  |
నిర్మాణ రంగ కార్మికులకు రూ.5000 చెల్లించాలి
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులకు సీఐటీయూ ఆధ్వర్యంలో సుమారు 100 మందికి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రేవంత్ కుమార్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ నేపథ్యంలో నిర్మాణ రంగ కార్మికులు పూర్తిగా ఉపాధి కోల్పోయారని తెలిపారు. రోజు వారిగా పని ఉంటే కుటుంబాలు పోషించే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్మాణ రంగ కార్మికులకు ప్రస్తుత అవసరాల రీత్యా రూ. 5000 చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు. సీఐటీయూ కార్మిక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తునే ఇలాంటి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు.

Tags : Construction, workers, five thousand rupees, medak, citu union

Next Story