2022 కల్లా రామమందిర నిర్మాణం పూర్తి

by  |
2022 కల్లా రామమందిర నిర్మాణం పూర్తి
X

అయోధ్యలో 2022 కల్లా రామ మందిరాన్ని నిర్మిస్తామని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ కామేశ్వర్ చౌపాల్ వెల్లడించారు. 19న ప్రయగరాజ్ లో అయోధ్య ఆలయ కమిటీ మొదటిసారి సమావేశం అవుతుందన్నారు. ఈ భేటీలో ఆలయ నిర్మాణం, శంకుస్థాపన కార్యక్రమాలపై ట్రస్ట్ ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం 67 ఎకరాల స్థలం కేటాయించారని, అయితే ఇది సరిపోదని, ఇంకా ఎక్కువ స్థలం కావాలని ఆయన కోరారు. రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని కామేశ్వర్ వెల్లడించారు.

Next Story

Most Viewed