స్టేషన్‌కు వెళ్లిన మహిళతో కానిస్టేబుల్..

by  |
స్టేషన్‌కు వెళ్లిన మహిళతో కానిస్టేబుల్..
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో కీచక కానిస్టేబుల్ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. సాయం చేయండి అని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఆమెకు ఫోన్ వేధిస్తున్నాడు. విషయం ఎస్పీకి తెలియడంతో కీచక కానిస్టేబుల్ పై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు.

జిల్లాలోని రుద్రంగి మండలంలోని ఓ తండాకు చెందిన మహిళ భూ వివాదంలో మండల పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆ సమయంలో సదరు మహిళ ఫోన్ నంబర్ తీసుకున్న ప్రశాంత్ అనే కానిస్టేబుల్.. కేసు సాకుతో ఆమెకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. ఆ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోన్ రికార్డులు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేకు తెలియడంతో విచారణ జరిపి కానిస్టేబుల్ ప్రశాంత్ ను సస్పెండ్ చేశారు.

Next Story