- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోనీ రాయపోల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ కరోనా నుంచి కోలుకుని, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ సన్ షైన్ ఆసుపత్రిలో O+ప్లాస్మా అవసరం ఉందని వాట్సాప్ గ్రూపులో ఆయనకు సమాచారం వచ్చింది.
వెంటనే దానికి స్పందించి, డ్యూటీ నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరాడు. కరోనా సోకిన వేరొక వ్యక్తిని రక్షించడానికి, ప్లాస్మాదానం చేశాడు. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్లు, కరోనా వ్యాధి సోకిన వ్యక్తి బంధువులు, జిల్లా పోలీసు అధికారులు చంద్రశేఖర్ను అభినందించారు.
Next Story