నేడు కాంగ్రెస్ మౌన దీక్ష

by  |
నేడు కాంగ్రెస్ మౌన దీక్ష
X

దిశ, వెబ్ డెస్క్: నేడు వీరజవాన్లను స్మరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ‘అమర వీరులకు సలాం’ పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు మౌనదీక్ష చేపట్టనున్నారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలలోని గాంధీ, ఇతర జాతీయ నేతల విగ్రహాల వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ మౌన దీక్షను కొనసాగించనున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఈనెల 29న కలెక్టరేట్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed