ఆ ముచ్చట రహస్య ఒప్పందం !

by  |
ఆ ముచ్చట రహస్య ఒప్పందం !
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాయలసీమ రిజర్వాయర్లు పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌తోనే నింపుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ వద్ద టెలిమెట్రీ పెడితేనే నీళ్ల లెక్క తేలుతుందని, అక్కడ సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రహస్య ఒప్పందంతోనే 203 జీవో విడుదలైందని, అందుకే కేసీఆర్ ఫ్యామిలీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌పై మాట్లాడటం లేదని విమర్శించారు. ఏపీ 203 జీవో నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఛైర్మన్, కేంద్రమంత్రికి లేఖలు రాస్తామన్నారు.



Next Story

Most Viewed