జగ్గారెడ్డిపై అధిష్టానం ఆగ్రహం.. మధ్యాహ్నం హైదరాబాద్‌కు ఠాగూర్

by  |
MLA Jagga Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ఆరా తీయనున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు. దీంతో జగ్గారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

కాగా, కాంగ్రెస్‌లో హీరోయిజం కుదరదు.. ఒక్కడి ఇమేజ్‌ కోసం మిగతా వారిని తొక్కేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనా లేక ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీనా?. పార్టీలో చర్చించక ముందే ప్రోగ్రాంలు ఫిక్స్‌ చేయడమేంటి. కాంగ్రెస్‌లో అందరూ సమానమే. ఒక్కరే స్టార్‌ అనుకుంటే కుదరదు. సంగారెడ్డికి పీసీసీ వస్తే.. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తనకే సమాచారం ఇ‍వ్వరా?. ఈ మాత్రం ప్రోటోకాల్‌ కూడా తెలీదా. జగ్గారెడ్డికి, రేవంత్‌ రెడ్డికి విభేదాలు ఉన్నట్లు రేవంత్‌ పరోక్షంగా చెబుతున్నారా? అంటూ రేవంత్‌ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed