మరుగుదొడ్ల కోసం కాంగ్రెస్ ధర్నా.. మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం

by  |
Dharna-congress
X

దిశ, అమరచింత: పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అయూబ్ ఖాన్ మాట్లాడుతూ పలు వార్డుల్లో మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలు వార్డులలో పార్కుల నిర్మాణాలు పూర్తికాక పరిస్థితి దారుణంగా తయారైంది అని తెలిపారు. పట్టణంలో సీసీ రోడ్లు, కొత్త డ్రైనేజీని నిర్మించాలని, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాలుగో వార్డ్ కౌన్సిలర్ సింధు, మాజీ ఎంపీటీసీ విష్ణు, పట్టణ అధ్యక్షులు అరుణ్ , వెంకటేశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed