పార్టీ పరువును బజారుకీడుస్తున్నరు

by  |
పార్టీ పరువును బజారుకీడుస్తున్నరు
X

దిశ, సూర్యాపేట: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ పరువును బజారుకీడుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర రావు అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం రెడ్ హౌజ్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ గొంతుకలం అని చెప్పుకుని తిరిగేవారే పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలని, నిస్వార్థ ప్రజాసేవ చేస్తున్న రాంరెడ్డి దామోదర్ రెడ్డి మీద చేసిన నీచమైన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

పోలీస్ కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. తమ పబ్బం గడుపుకోవడానికి పెట్టిన అసత్య కేసులు నిలబడేవి కావు అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వాస్తవాలను తెలియజేశామని చెప్పారు. పార్టీకి నష్టం చేసే వ్యక్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. తన అసమర్థతను పరాయి వాళ్లమీదకు నెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడడం దారుణం అని, దామోదర్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.



Next Story

Most Viewed