కాంగ్రెస్ కు షాక్.. టీఆర్ఎస్ లో చేరిన ఆ నేత..

by  |
కాంగ్రెస్ కు షాక్.. టీఆర్ఎస్ లో చేరిన ఆ నేత..
X

దిశ, పరకాల: హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ సిలువేరు ఈశ్వరమ్మ, చిన్నయ్య కాంగ్రెస్ పార్టీని వీడి గురువారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. వారి వెంట గ్రామానికి చెందిన సిలివేరు రమేష్, కొత్తూరు శ్రీకాంత్, మామిడి బాబు, మంగలపల్లి సరిత తదితరులు చేరారు.

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సిలివేరు మొగిలి, తెరాస మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, నాయకులు మునిగాల సురేందర్ రావు, మాజీ సర్పంచ్ ఇనుగాల రమేష్, చిలివేరు సారయ్య, దొగ్గేల రాజేందర్, సిలివేరు రాఘవ, సిలివేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed