అసమ్మతి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ వార్నింగ్

by  |
అసమ్మతి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో రాజకీయం మరింత హీటెక్కింది. సీఎం అశోక్ గెహ్లాట్‌ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన అసమ్మతి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరకపోతే వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశామని తెలిపింది. ఈ మేరకు పార్టీ ఆదేశాలను ధిక్కరించి సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టిన డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీనేత సచిన్ పైలట్‌ను పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే..తాజాగా పైలట్ కు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోకపోతే వారి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసేందుకు స్పీకర్ ద్వారా కాంగ్రెస్ నోటీసులు ఇప్పించింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed