ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు..!

by  |
ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అమరావతిలో ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఈ మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇప్పటికే రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించగా, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. కాగా, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో అధికార వైసీపీ మద్దతిచ్చిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed