ఆ పని చేసినందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం: కాంగ్రెస్ నేతలు

by  |
ఆ పని చేసినందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం: కాంగ్రెస్ నేతలు
X

దిశ, మణుగూరు: భూర్గంపాహాడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులేపల్లి సుధాకర్ రెడ్డి.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నిర్ధారణ కావడంతో.. ఎమ్మెల్యే పొదేం వీరయ్య ఆదేశాల మేరకు పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని.. పినపాక నియోజకవర్గ కో-కన్వీనర్ గురిజల గోపి తెలిపారు. శుక్రవారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుధాకర్ రెడ్డి పార్టీ కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గతంలో కూడా పలుమార్లు చెప్పినా, షోకాజ్ నోటీసులు ఇచ్చినా ప్రవర్తన మాత్రం మార్చుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో పులేపల్లి సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఆ నాయకులకు వేటు తప్పదని ఈ సందర్భంగా గురిజల గోపి హెచ్చరించారు.



Next Story

Most Viewed