- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలోని రైతుల సమస్యలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. రాజీవ్ రైతుల భరోసా దీక్షలో అనేక మంది రైతులు తమ సమస్యలు తన దృష్టికి తీసుకొస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. యాసంగి నాట్లు మొదలైన తరుణంలో యూరియా కొరత ఉందని రైతులు చెబుతున్నారని తెలిపారు. రెండేళ్లు అయినా లక్ష రుణ మాఫీ హామీ అమలు కాలేదని మండిపడ్డారు. మరోవైపు రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. రైతుబంధు నిధులు పాత రుణాల వడ్డీ కింద జమ చేసుకుంటున్నారని విమర్శించారు.
సన్నవడ్లు పండించిన రైతులకు పెట్టుబడి రాని పరిస్థితి నెలకొందని.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫాంహౌస్లో కూర్చుని దృతరాష్ట్రుడిలా అంతా బాగుంది అని భ్రమించకండని సీఎం కేసీఆర్ను విమర్శించారు. రైతుల రుణమాఫీ నిధులను తక్షణమే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.