దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం

by  |
దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
X

దిశ, దుబ్బాక: ఏడేళ్ల పాలనలో ఏఒక్క హామీని అమలుచేయని ప్రభుత్వంపై ప్రజలు కన్నెర్ర జేశారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం, అక్బర్‌పేట, కూడవెళ్లి గ్రామాల్లో గురువారం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చెరుకు శ్రీనివాస్‌రెడ్డి గెలిస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. బీసీలు అనుకుంటే దుబ్బాక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎటు చూసినా ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని, ఆయన ఆశయాలను కొనసాగించాలంటే కొడుకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలన్నారు.

Next Story

Most Viewed