- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, జగిత్యాల: ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు నిరసన తెలిపే హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లేకుండాపోయిందని, కాంగ్రెస్ నాయకుల అక్రమ నిర్బంధాలతో ప్రజల గొంతు నొక్కలేరని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం జగిత్యాలలోని ఇందిరాభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాసమస్యలను స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనుకోవడం నేరమా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
సమైక్య రాష్ట్రంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులు నేటికీ పూర్తికాకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పి శిలాఫలకాలు వేసిన సూరమ్మ చెరువు ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి కూడా తీయలేదని మండిపడ్డారు. ఏడాదిలోపు ఎత్తిపోతల ద్వారా నింపుతామన్న మిడ్ మానేరు ఎప్పుడు నింపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.