కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్.. కారణం ఇదే?

by  |
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్.. కారణం ఇదే?
X

రాజస్థాన్: రాజస్థాన్ కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ షాకిచ్చింది. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్రసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాల ప్రకటన చేశారు. అనంతరం బీజేపీ నేతలపై ఆయన పలు విమర్శలు చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ నేతలు పెద్ద మొత్తంలో ముట్టజెప్పేందుకు ముందుకొచ్చారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా, ప్రస్తుతం రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed