స్కూళ్లు మూసివేయడం మంచిదే.. కానీ

by  |
Congress MLA Jagga Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యాసంస్థలు మూసివేయం సరైన నిర్ణయమేనని, కానీ వసూలు చేసిన ఫీజుల పరిస్థితి ఏమిటని కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. వేలాది రూపాయలు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను హత్య చేశారని, ఇది కూడా క్రిమినల్​ చర్యే అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వమే ఆర్థిక సంక్షేభంలో ఉన్నట్లు ప్రకటించిందని, అలాంటిది ప్రజలు ఆర్థిక పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని, ఈ దుస్థితిలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు ఫీజులు వసూలు చేసి, పది రోజులు కూడా నడపకుండా పాఠశాలలు మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రైవేట్​ విద్యాసంస్థల యాజమాన్యాల ఒత్తిడితో విద్యార్థులు, తల్లిదండ్రులకు రోగాలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం పరిష్కారం చూపించాలని కోరారు. చెల్లించిన ఫీజుల్లో కనీసం సగమైనా తిరిగి ఇప్పించాలని డిమాండ్​ చేశారు. కరోనా ఇప్పటితో పోదని, ఇంకో ఏడాది ఉన్నా ఆశ్యర్యం లేదన్నారు. మళ్లీ లాక్​డౌన్​ వచ్చే పరిస్థితులు లేకుండా ముందుగా బార్లు, మద్యం దుకాణాలు, థియోటర్లు, పార్కులు మూసివేయించాలని సూచించారు. అసెంబ్లీలో కాంగ్రెస్​ ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం రావడం లేదని, నియోజకవర్గ సమస్యలు చెప్పే చాన్స్​ లేదని తెలిపారు. సంగారెడ్డిలో మెడికల్​ కాలేజీ ముందుకు పడలేదని, ఇండ్లు ఇవ్వలేదని చెప్పారు. సంగారెడ్డి సెగ్మెంట్​ అభివృద్ధికి ట్యాంక్​ బండ్​ అంబేద్కర్​ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

Next Story