హరీశ్ రావును చూస్తే నాకే సిగ్గేస్తుంది : జగ్గారెడ్డి

by  |
హరీశ్ రావును చూస్తే నాకే సిగ్గేస్తుంది : జగ్గారెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: హరీష్ రావు కరోనా పేరు మీద సంగారెడ్డికి వచ్చి కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హరీశ్ రావు ఇలా పార్టీ ఫిరాంపులు చేస్తుంటే నాకే సిగ్గు అనిపిస్తుందని ఆయనకు ఏమి అనిపించడం లేదా.? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని పో, కానీ పార్టీలో జాయిన్ అయినవారిని మోసం చేయకండి అని ఫైర్ అయ్యారు. నమ్మి వచ్చిన వారిని రోడ్డు మీద నెట్టకు.. అంటూ మండిపడ్డారు. సంగారెడ్డిని దత్తత తీసుకుంది కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్‌లో చేర్చుకోవాడానికేనా అని ప్రశ్నించారు. తాను ఇప్పుడు రాజకీయం చేయడం లేదని, ప్రజల ప్రాణాలు ముఖ్యమని అన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్‌లపై ప్రజలకు నమ్మకం పోతోందని, వెళ్తే చనిపోతామని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. మంత్రి హరీష్ రావు ప్రభుత్వ హాస్పిటల్‌లపై ప్రజలకు నమ్మకం కలిగించాలని అన్నారు. హరీష్ రావు సంగారెడ్డికి వచ్చి కలెక్టర్ ఆఫీస్‌లో రివ్యూ పెట్టడం కాదని, ప్రభుత్వ హాస్పిటల్‌లో రివ్యూ పెట్టి ప్రజలకి నమ్మకం కలిగించాలని కామెంట్ చేసారు. ఆర్ధిక మంత్రిగా ఉండి సంగారెడ్డికి వెయ్యి, రెండు వేల కోట్లు తీసుకొని రాలేవా? అని ప్రశ్నించారు.

Next Story