బాధితులకు ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

by  |
బాధితులకు ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చెర్లఅంకిరెడ్డిపల్లి గ్రామంలో గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కూలిన ఇండ్లను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి పరిశీలించి, భాదితులను పరమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిరుపేదల ఇళ్లు కూలిపోయి నిలువ నీడలేడుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం యుద్ద ప్రతిపాదికన డబుల్ బెడ్ రూమ్ నిర్మించి ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఉన్న గ్రామాల్లో బాధితులకు డబుల్ బెడ్రూమ్‌లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంకిరెడ్డిపల్లిలో పూర్తిగా కూలిపోయిన వారికి రెండు వేల రూపాయలు సహాయం చేశారు.



Next Story

Most Viewed