తాండూరు‌లో బిపిన్ రావత్‌కు ఘన నివాళులు

by  |
Congress leaders
X

దిశ, తాండూర్: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్‌కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కేంద్రంలోని ఐబీలో గురువారం నివాళులు అర్పించారు. అనంతరం సంతాప సభ నిర్వహించి, రావత్ చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రావత్ మృతి దేశానికి, సైనిక దళాలకు తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ ఈసా, పేరం శ్రీనివాస్, పోశం దామోదర్ రెడ్డి, షేక్ మొమిన్ అలీ, శ్రీనివాస్, ఎండీ జుబైర్, లక్ష్మణ్, గణేష్, రామచందర్, చాంద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed